తొలి సినిమా ఏ మాయ చేశావె నుంచి అందం కన్నా అభినయానికే ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి తక్కువ కాలంలోనే సమంత నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.యూటర్న్, ఓ బేబీ, జాను లాంటి సినిమాల ద్వారా ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగలనని సమంత ప్రూవ్ చేసింది.
పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సమంతను నిశ్శబ్దం సినిమా ఫలితం భయపెట్టింది.మాధవన్ హీరోగా అనుష్క హీరోయిన్ గా తెరకెక్కిన నిశ్శబ్దం సినిమా ఈ నెల 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదలై డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో నటించింది.ఈ పాత్ర కోసం అనుష్క ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది.నటిగా నిశ్శబ్దం అనుష్కకు మంచి పేరు తెచ్చిపెట్టినా థియేటర్లలో ఈ సినిమా విడుదలై ఉంటే భారీగా నష్టాలు వచ్చేవని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.అనుష్క నిశ్శబ్దం సినిమాలో పోషించిన పాత్ర తరహాలోనే అశ్విన్ శరవణన్ అనే తమిళ డైరెక్టర్ సమంతకు లాక్ డౌన్ ముందు ఒక కథ చెప్పారు.
సినిమా కథ నచ్చడంతో సమంత నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే అదే సమయంలో లాక్ డౌన్ విధించడంతో ఈ సినిమా పనులు మొదలుకాలేదు.అయితే నిశ్శబ్దం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ కావడంతో అలాంటి పాత్రతో రిస్క్ ఎందుకు.? అని సమంత భావిస్తోంది. ఇప్పటికే షూటింగులు మొదలైనా సమంత మాత్రం కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ కు దూరంగానే ఉంది.చాలా సెలక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటున్న సమంత సినిమాలలో గ్లామర్ రోల్స్ కు గుడ్ బై చెప్పినా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూ ఉండటం గమనార్హం.