టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి సమంత.ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం పైగా పూర్తిచేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరితో కూడా సుమారుగా నటించింది.
ఇప్పటికి తన బ్రాండ్ ఇమేజ్ తో వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంటుంది సమంత.టాలీవుడ్ లో బిగ్ ఫ్యామిలీ అక్కినేని ఇంటి కోడలు అయిన తర్వాత కూడా సమంత నటిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
నాగచైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత రంగస్థలం లాంటి సూపర్ హిట్ సినిమాలో సమంత భాగమైంది.అలాగే మజిలీ మూవీతో మరోసారి తన భర్త చైతన్యతో కలిసి నటించి హిట్ కొట్టింది.
ఓ బేబీ సినిమాతో సోలోగా తను బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంది.ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫిమేల్ సెంట్రిక్ కథలపైనే సమంత దృష్టి పెడుతుంది.
రీసెంట్ గా ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ తో హిందీలోకి కూడా సమంత ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం మూవీలో సమంత టైటిల్ రోల్ పోషిస్తుంది.
పౌరాణిక ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడు గుణశేఖర్ ఆవిష్కరించబోతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా సమంత తన కో స్టార్స్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
అందులో నయనతార హాట్ అంటూ కితాబు ఇచ్చింది.
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి బెస్ట్ యాక్టర్ అంటూ ప్రశంసలు కురిపించింది.అలాగే బ్రిటిష్ బ్యూటీ ఎమిజాక్సన్ చాలా అందంగా ఉంటుందని పొగిడేసింది.మొత్తానికి సాయి పల్లవి పర్ఫామెన్స్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవడం కాకుండా తోటి హీరోయిన్ కూడా కనెక్ట్ కావడం ఆసక్తికర విషయం అని చెప్పాలి.
ప్రస్తుతం సమంత భర్త నాగ చైతన్యతో సాయి పల్లవి లవ్ స్టొరీ సినిమాలో నటించింది.