కంగనా రనౌత్ ముచ్చటగా మూడవసారి ఉత్తమ్ నటిగా జాతీయ అవార్డు అందుకుంది.ఈ సందర్భంగా కంగనాను అక్కినేని కోడలు సమంత పొగడ్తలతో ముంచేసింది.
మార్చి 23 న తన పుట్టినరోజు సందర్భంగా కంగనా నటించిన ‘తలైవి’ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు.ఈ ట్రైలర్ ను చుసిన సమంత ట్రైలర్ చాలా బాగుందని.
కంగనా చాలా మంచి నటి అని సమంత ట్వీట్ చేసారు.
అంతేకాదు నటన పరంగానే కాదు.
మా జనరేషన్ లో అత్యంత దైర్యవంతురాలివని కంగనాను ప్రశంసలతో ముంచెత్తింది.అంతేకాదు డైరెక్టర్ ఏ.ఎల్ విజయ్ ను కూడా ప్రశంసించింది.ఈ సినిమా థియేటర్ లో చూడడానికి చాలా ఎదురు చూస్తున్నానని ఆమె ట్వీట్ చేసింది.
నేను కూడా కంగనా ఫ్యాన్ అయిపోయానని సమంత చెప్పింది.కేవలం సమంత మాత్రమే కాదు ఈ ట్రైలర్ చుసిన ప్రతి ఒక్కరు కంగనా నటనను మెచ్చుకుంటున్నారు.
ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.జయలలిత బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో కంగనా జయలలిత పాత్రలో నటిస్తుంది.ఈ సినిమాలో కంగనా ను చుస్తే జయలలితను చూసి నట్టుగానే ఉందని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.
అంతలా కంగనా ఈ పాత్రలో ఒదిగిపోయి నటించింది.మరి కొంత మంది అయితే 2021 జాతీయ ఉత్తమ నటిగా కూడా కంగనా నే అవార్డు అందుకుంటుందని చెబుతున్నారు.
అంతలా జయలలిత పాత్రలో జీవించింది కంగనా.ఈ ట్రైలర్ చుసిన ప్రేక్షకులు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి.కంగనా పుట్టిన రోజును తలైవి సెట్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులు ఆమెకు బర్త్ డే విషెష్ తెలిపారు.కాగా తలైవి సినిమా ఏప్రిల్ 23 న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.