టాలీవుడ్ స్టార్ బ్యూటీ అక్కినేని సమంత పెళ్లి తరువాత ఏ రేంజ్లో సినిమాలు చేస్తుందో అందరికీ తెలిసిందే.ఈమె చేసే ప్రతి సినిమా ఒకదానికొకటి సంబంధం లేకపోవడంతో ప్రేక్షకులు ఆమె సినిమాలను ఆదరిస్తున్నారు.
కాగా గతకొంత కాలంగా సరైన కథలను ఎంచుకోవడంలో సామ్ తప్పటడుగులు వేస్తోంది.దీంతో ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్, ఫ్లాపులుగా మిగులుతున్నాయి.
అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్లకు బీభత్సమైన ఆదరణ లభిస్తుండటంతో ఆమె అటువైపు అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలోనే ఓ వెబ్ సిరీస్లో నటించేందుకు సామ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది.
గతంలో తెరకెక్కిని ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ ఎలాంటి ఆదరణ అందుకుందో అందరికీ తెలిసిందే.ప్రియమణి, మనోజ్ బాజ్పాయి కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ టెర్రరిస్టు బ్యాక్డ్రాప్లో తెరకెక్కింది.
ఆకట్టుకునే స్టోరీలైన్ ఉండటంతో ఈ వెబ్ సిరీస్కు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.రాజ్ ఎన్డీకే దర్శకత్వంలో వచ్చిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ను ప్లాన్ చేస్తున్నారు.
ఈ సీక్వెల్లో సమంత అక్కినేని నటించేందుకు ఓకే అనేసింది.
అయితే ఆమె కూడా ఇందులో ఓ టెర్రరిస్టు పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
మానవత్వం లేని పాత్రగా ఆమె క్యారెక్టర్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.ఏదేమైనా తమ ఫెవరెట్ హీరోయిన్ను ఇలా ఓ టెర్రరిస్టు పాత్రలో చూస్తామని అనుకోలేదంటున్నారు సామ్ ఫ్యాన్స్.
మరి సామ్ నటించబోయే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే అది రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.