ఇటీవల హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్త్రీ’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.కేవలం 15 కోట్లతో నిర్మాణం అయిన ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరింది.
హర్రర్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో శ్రధ్దా కపూర్ హీరోయిన్గా నటించింది.ఏమాత్రం అంచనాలు లేకుండా, అసలు ఈ చిత్రం ఎప్పుడు తెరకెక్కిందో అనే విషయం కూడా తెలియకుండా పూర్తి చేసి విడుదల చేశారు.
మెల్ల మెల్లగా ఈచిత్రం బాలీవుడ్ ప్రేక్షకులకు ఎక్కింది.కేవలం రెండు వారాల్లో ఏకంగా 100 కోట్లను ఈ చిత్రం రాబట్టింది.
మొదట విడుదల చేసిన థియేటర్ల కంటే డబుల్ థియేటర్లు ఈ చిత్రంకు పెరిగాయి.
సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ‘స్త్రీ’ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు ఆసక్తి చూపుతున్న హీరోయిన్ సమంత వద్దకు ఈ ఆఫర్ వెళ్లినట్లుగా సమాచారం అందుతుంది.అయితే ఇటీవలే యూటర్న్ అనే హర్రర్ చిత్రం చేసిన సమయంత ప్రస్తుతం మరో హర్రర్ సినిమాకు ఆసక్తిగా లేదని సమాచారం అందుతుంది.
అందుకే ఆ అవకాశం కోసం నిహారిక ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
తెలుగు మరియు తమిళంలో నిహారిక ‘స్త్రీ’ చిత్రం రీమేక్లో నటించాలని కోరుకుంటుంది.ఇప్పటికే స్త్రీ రీమేక్ రైట్స్ తీసుకున్న నిర్మాతలు నిహారికతో కూడా సంప్రదించినట్లుగా తెలుస్తోంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం రీమేక్లో ఎవరు నటిస్తారు అనే విషయంలో అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
హిందీలో భారీ విజయం సాధించిన స్త్రీ చిత్రాన్ని నిర్మించినది తెలుగు నిర్మాతలే.అందుకే ఈ చిత్రంను తెలుగులో కూడా వారే నిర్మించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.