టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.
ఇకపోతే సమంత మొన్నటి వరకు మయోసైటిస్( Myositis ) వ్యాధితో బాధపడిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పుడిప్పుడే సమస్య నుంచి పూర్తిగా కోలుకొని పూర్తిస్థాయిలో సినిమాలలో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.
ఇది ఇలా ఉంటే సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం.
ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది.ఈ సందర్భంగా ఆమె ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొంది సమంత.
ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితిపై కీలక విషయాలను వెల్లడించింది.ఈ సందర్బంగా సమంత మాట్లాడుతూ.
మయోసైటిస్ నిర్ధారణ కాగానే మొదట్లో చాలా బలహీనంగా అనిపించేది.యశోద సినిమా సమయంలో ఆరోగ్యం బాగా క్షీణించింది.
అయినా కూడా ప్రమోషన్స్లో పాల్గొన్నాను.ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఓపిక కూడా లేదు.
చాలా మందులు వాడాల్సి వచ్చేది.సినిమాను బాధ్యతగా భావించి కష్టమైన సరే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను.
అయితే ప్రస్తుతం ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తోంది.మయోసైటిస్ నుంచి కోలుకుని ధైర్యంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది సమంత.సమంత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.సినిమాల పట్ల సమంతకు ఉన్న డెడికేషన్ ని మెచ్చుకుంటున్నారు.ఇకపోతే సమంత నటించిన శాకుంతలం( Sakunthalam ) సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సినిమాలో దేవ్ మోహన్, సచిన్ ఖేడ్కర్, మోహన్బాబు, అదితి బాలన్, అనన్య ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.