టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఇటీవల జాను అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫెయిల్యూర్గా మిగిలింది.
కాగా తాను సినిమాలకు దూరం అవుతున్నట్లు వచ్చిన వార్తలపై సమంత మండి పడింది.ఏకంగా రెండు సినిమాలను లైన్ పెట్టి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
కాగా తెలుగులో కాకుండా అమ్మడు తమిళంలోనే రెండు సినిమాలను లైన్లో పెడుతోంది.విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ముక్కోణపు ప్రేమకథా చిత్రంలో సమంత కూడా నటిస్తోంది.
ఇక ఈ సినిమా పూర్తి కాకముందే అశ్విన్ శరవణన్ తెరకెక్కించనున్న ఓ హారర్ చిత్రంలో నటించేందుకు సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.ఈ జోనర్ మూవీలు సమంతకు పెద్దగా అచ్చిరాలేదు.
గతంలో ఆమె నటించిన రాజుగారిగది-2 సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మరోసారి ఇదే జోనర్ మూవీని సమంత ఎంచుకోవడంతో ఆమె ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
అటు ఒక్క తెలుగు సినిమాను కూడా ఓకే చేయని సామ్, తమిళంలో రెండు సినిమాలను ఓకే చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తు్న్నారు.మరి ఈ వార్తలపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.