సౌత్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న నటి సమంత.ఈ అమ్మడు దశాబ్దం పాటు తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది.
అందం, అభినయం, అవసరం అయితే మరింత గ్లామర్ గా కూడా కనిపించడానికి సమంత సిద్ధంగా ఉండటం ఈమెకి దర్శక, నిర్మాతలు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు.ఈ నేపధ్యంలో తమన్నా, కాజల్, సమంత వీరి ప్రస్తానం సౌత్ లో ఏకంగా పదేళ్ళు కొనసాగింది.
అయితే వీరిలో తమన్నా, కాజల్ అగర్వాల్ హిందీలో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని అక్కడ కూడా పలువురు హీరోలతో నటించాడు.స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకోకపోయిన బాలీవుడ్ లో కూడా తమ మార్క్ చూపించారు.
అయితే సమంత మాత్రం బాలీవుడ్ అవకాశాలు వచ్చిన అక్కడికి వెళ్ళడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.భారీ రెమ్యునరేషన్ తో ఆఫర్స్ వచ్చిన కూడా తిరస్కరించింది.అసలు బాలీవుడ్ ఆఫర్స్ ని వదులుకోవడంపై తాజాగా సమంత వివరణ ఇచ్చింది.తనకి మొదటి నుంచి తెలుగు, తమిళ సినిమాలే ప్రాధాన్యత.
అలాగే ఉత్తరాది ప్రేక్షకులు ఎలా ఉంటారో నాకు తెలియదు, వాళ్ళ టేస్ట్ ఏంటో తెలియదు.అయితే తెలుగు, తమిళ ప్రేక్షకులు నా నుంచి ఎం కోరుకుంటారో స్పష్టమైన క్లారిటీ ఉంది.
అందుకే అన్ని ఆలోచించి బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చిన చేయలేదు అని చెప్పింది.అయితే ఫ్యామిలీ మెన్ సిరిస్ అంటే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించారు.
అది కూడా తెలుగు దర్శకులే దీనిని ఆవిష్కరించారు.అందుకే ఎలాంటి టెన్షన్ లేకుండా చేశాను అని చెప్పుకొచ్చింది.