టాలీవుడ్ స్టా్ర్ బ్యూటీ అనుష్క ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్ధం’ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ఇప్పటికే అన్ని కార్యక్రమాలు ముగించుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న రిలీజ్ కావాల్సి ఉంది.
కానీ కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ సినిమాను వాయిదా వేశారు.ఇక తన నెక్ట్స్ సినిమాల సెలెక్షన్పై పడింది అనుష్క.
ఇందులో భాగంగా ఉద్యమ నాయకురాలి బెంగుళూరు నాగరత్నమ్మ జీవితగాధను బయోపిక్ చిత్రంగా తెరకెక్కించేందుకు సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు రెడీ అవుతున్నారు.ఈ సినిమాలో స్వీటీ అనుష్కను తీసుకోవాలని ఆయన భావిస్తున్నాడు.
కానీ ఇప్పుడు ఈ సినిమాలో అనుష్క పేరు కాకుండా అక్కినేని సమంత పేరు వినిపిస్తుంది.ఇటీవల లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తు్న్న సమంత అయితే ఈ సినిమాకు బాగా సూట్ అవుతుందని సింగీతం భావిస్తున్నాడట.
అందుకే ఈ సినిమాలో అనుష్కను కాకుండా సమంతను తీసుకుంటే క్రేజ్ కూడా కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.మరి ఈ సినిమాలో నటించేందుకు సమంత ఏం అంటుందో చూడాలి.