టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాదిలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కాని ఈ ఏడాదిలో సమంత ఒక్క సినిమా కూడా చేసే అవకాశం కనిపించడం లేదు.
ఒక వేళ ఈ కరోనా లేకున్నా కూడా ఈ ఏడాదిలో సమంత సినిమా విడుదల అయ్యేది కాకపోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఎందుకంటే సమంత సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎక్కువగా సినిమాలు చేయాలనుకోవడం లేదు.
కమర్షియల్ పాత్రలు చేసేందుకు సమంత ఆసక్తి చూపడం లేదు.ఇదే సమయంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలను ఆమె చేయాలని భావిస్తుంది.అందుకు సంబంధించిన స్క్రిప్ట్లు వింటుంది.గత కొంత కాలంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా సినిమాలు చేసింది.
కాని ఎక్కువగా కమర్షియల్ సినిమాలే ఎక్కువ.అయితే నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత తన పంథా మార్చుకుంది.
ప్రస్తుతం ఈమె నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
వీరిద్దరి కాంబోలో వచ్చిన ఓ బేబీ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
అందుకే మళ్లీ వీరిద్దరు కలిసి మరో రీమేక్ను ప్లాన్ చేశారు.ఆ సినిమాకు సంబంధించిన ప్రచారం జోరుగా సాగింది.
కాని ఇప్పటి వరకు ఆ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు.అసలు ఇప్పటి వరకు అధికారిక ప్రకటన కూడా రాలేదు.
సమంత అభిమానులు ఆమె సినిమా ఎంత వరకు వచ్చింది అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.