ఈ మధ్య మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువుగా వినిపిస్తున్న పేర్లు సమంత, నాగ చైతన్య.వీరిద్దరూ 10 ఏళ్ల స్నేహ బంధం ను, 7 ఏళ్ల ప్రేమను, నాలుగేళ్ళ వివాహ బంధం నుండి విడిపోయి అభిమానులకు షాక్ ఇచ్చారు.
వీరిద్దరూ విడాకులు తీసుకోవడం అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేక పోతున్నారు.అసలు వీరిద్దరూ విడిపోతారని ఎవ్వరు ఊహించలేదు.
కానీ వీరు విడాకులు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారనే చెప్పాలి.ఇక ఇంతకుముందు సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది.కానీ విడాకులు ప్రకటన తర్వాత దీని నుండి అంత త్వరగా బయటకు రాలేక పోతుంది.అందుకే అభిమానులకు టచ్ లో ఉండడం లేదు.
అయితే సమంత దసరా కు అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
కానీ పెళ్ళికి ముందు లాగా గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంది.అయితే విడాకులు తర్వాత మాత్రం సమంత వరుస ప్రాజెక్ట్స్ మీద సైన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో నటించిన సమంత ఇప్పుడు మరొకసారి రాజ్ అండ్ డీకే తో పని చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ఇక తెలుగులో కూడా ఒక ప్రాజెక్ట్ పై సైన్ చేసినట్టు టాక్.కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణం వహించనున్నారు.
అంతేకాదు ఒక బాలీవుడ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం అయితే వస్తుంది.అయితే సమంత తన ప్రాజెక్ట్స్ గురించి దసరా కు అనౌన్స్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మరి చూడాలి రేపు సమంత అభిమానులకు ఎంత సర్ప్రైజ్ ఇస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే సమంత ప్రెసెంట్ నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.తమిళ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమా కూడా షూటింగ్ జరుపు కుంటుంది.