టాలీవుడ్ ఇండస్ట్రీలో సామ్ చైతన్య విడాకుల అంశం అందరిని షాక్ కు గురి చేసిందనే చెప్పాలి.ఎంతో అన్యోన్యంగా ఉండే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నారని తెలిసి టాలీవుడ్ లో అభిమానులతో పాటు ప్రముఖులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
వీరిద్దరూ విడాకులు తీసుకోవడం అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేక పోతున్నారు.అసలు వీరిద్దరూ విడిపోతారని ఎవ్వరు ఊహించలేదు.
ఇక విడాకుల తర్వాత అటు సమంత, ఇటు నాగ చైతన్య ఇద్దరు కూడా తమ కెరీర్ లపైనే ద్రుష్టి పెట్టినట్టు కనిపిస్తుంది.నాగ చైతన్య కూడా లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ కొట్టి సూపర్ ఫామ్ లోకి వచ్చాడు.
ఇక సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో మంచి పేరు సంపాదించుకుని బాలీవుడ్ లో కూడా పరిచయం అయ్యింది.ఇక సామ్ విడాకులు తర్వాత వరుస ప్రాజెక్ట్స్ మీద సైన్ చేస్తున్నట్టు సమాచారం.
మరి తాజాగా దసరా పండుగ సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించి అభిమానులకు సంతోషం కలిగించింది.డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మాణంలో శాంతరూబన్ జ్ఞాన శేఖరన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు.ఇది తెలుగుతో పాటు తమిళ్ లో కూడా తెరకెక్కించ బోతున్నారు.ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కబోతుంది.ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలు చేసి డిఫరెంట్ గా ఉండాలని కోరుకుంటుంది.ఇక సమంత ప్రెసెంట్ నటించిన ‘శాకుంతలం‘ సినిమా ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇక త్వరలోనే విడుదలకు చేయబోతున్నారు.
అలాగే తమిళ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్‘ సినిమా కూడా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తుంది.