సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత ఆమెపై ఎన్నో రకాల రూమర్స్, నెగిటివ్ కామెంట్స్ గురించి మనందరికీ తెలిసిందే.అయితే అభిమానులు అనుకుంటున్న విధంగా అందులో ఎటువంటి నిజం లేదంటూ ఆమె స్పందించిన విషయం తెలిసిందే.
సమంత నాగ చైతన్య ల విడాకుల వ్యవహారం తర్వాత తప్పంతా కూడా సమంతదే అన్నట్లుగా వార్తలు వినిపించాయి.అంతేకాకుండా సమంత, నాగచైతన్య ల విడాకులకు అసలు కారణం ఏమిటి అనేది ఇంతవరకూ ప్రకటించలేదు.
ఇక ఈ విడాకుల బాధ నుంచి బయట పడటానికి చాలా ప్రయత్నిస్తోంది.అందుకోసం ఒంటరిగా కూడా గడుపుతోంది.
ఇలాంటి సమయంలో తాను కోలుకోవడానికి కాస్త సమయం కావాలి అంటూ సమంత తెలిపింది.
ఈ క్రమంలోనే స్నేహితురాలు ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డితో కలసి సమంత తీర్థయాత్రలకు వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహిస్తంది.
సమంతా విడాకుల ప్రకటన కంటే ముందు నుంచే మై మమ్మా సెడ్ అని హ్యాష్ ట్యాగ్ లతో చేసిన పోస్టుల వల్ల పెద్ద రచ్చే జరిగింది.తాజాగా మరొకసారి సమంత మరో మై మమ్మా సెడ్ అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.
ఇప్పుడు మీరు ఇలా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి.అలాగే రేపు ఏం కావాలని కోరుకుంటున్నారు అందుకోసం నిరంతరం పోరాడుతూ ఉండండి అని తెలిపింది.సమంత ఇంస్టాగ్రామ్ లో చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.విడాకుల బాధ నుంచి బయటపడేందుకే సమంత ఈ తీర్థయాత్రలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
సమంత సినిమాల విషయానికి వస్తే విడాకుల అనంతరం 2 కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిపింది.అంతేకాకుండా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటాను అని తెలిపింది.