అక్కినేని జంట నాగచైతన్య మరియు సమంత ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ జంటను చూస్తుంటే అభిమానులకు రెండు కళ్లు చాలడం లేదంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఇక ఇటీవల నాగచైతన్య బర్త్డేను సమంత చాలా స్పెషల్గా నిర్వహించింది.చైతూకు చాలా మంచి కానుకలు ఇచ్చింది.
ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా నాగచైతన్యకు పెద్ద ఎత్తున బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడంతో పాటు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు.
సింహాచలం దేవాలయంలో బొబ్బిలికి చెందిన సాగర్ అనే అభిమాని మోకాళ్లతో గుడి మెట్లు ఎక్కాడు.అతడు చేసిన సాహసంకు అంతా అవాక్కవుతున్నారు.ఈ విషయం అన్ని మీడియా సంస్థల్లో కూడా వచ్చింది.
సమంత ఈ విషయాన్ని రీ ట్వీట్ చేసి అతడి సాహసంను అభినందించి, కృతజ్ఞతలు తెలిపి అలాగే అతడిని కలవాల్సిందిగా కోరింది.త్వరలోనే సాగర్ హైదరాబాద్లో నాగచైతన్య మరియు సమంతలను కలవబోతున్నాడు.
అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సమయంలోనే కొందరు సోషల్ మీడియా నెటిజన్స్ మరో విధంగా స్పందిస్తున్నారు.అభిమానులు ఇలాంటి పనులు చేయడంను స్టార్స్ ఎంత మాత్రం ప్రోత్సహించవద్దు.ఇలా చేసిన వారికి కలవడం వంటివి చేస్తే మరికొందరు ప్రాణాలకు తెచ్చే పనులు చేసి కలిసేందుకు ప్రయత్నాలు చేస్తారు.
అందుకే ఇలాంటి పనులు చేయకుండా ఇంట్లో వారికి గౌరవించండి అంటూ బుద్ది చెప్పకుండా సమంత థ్యాంక్స్ చెప్పి ఇంటికి పిలవడం ఏంటీ కనీసం బుద్ది లేదా అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.మరి తనపై వస్తున్న విమర్శలకు సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.