టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఒకవైపు సినిమాలు వెబ్ సిరీస్ లు,పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు.
ఇలా సమంత 2 సంవత్సరాల క్రితం తన ఫ్రెండ్ సుశృతి క్రిష్ణతో కలిసి `సాకీ` పేరుతో ఉమెన్స్ వేర్ని ప్రారంభించింది.తన బ్రాండ్ కు తానే అంబాసిడర్ గా వ్యవహరిస్తూ బాగా ప్రమోట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ క్రమంలోనే సమంత ఈ బిజినెస్ అతి తక్కువ సమయంలోనే ఎంతో బాగా డెవలప్ అయిందని చెప్పాలి.మహిళలకు కావలసిన అన్ని రకాల ఫ్యాషన్ డిజైనింగ్ దుస్తులను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచుతూ తన వ్యాపారాన్ని విస్తరించింది.
ఇదిలా ఉండగా తాజాగా సమంత సాకీ బ్రాండ్ ను మరింత విస్తరింపచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే సాకీ గర్ల్స్ పేరుతో ఇకపై కిడ్స్ వేర్ని లాంచ్ చేయబోతుంది.
ఈ విషయాన్ని సమంత తన స్నేహితురాలు సుశృతి వెల్లడించారు.రెండు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లలకు కావాల్సిన వివిధ రకాల దుస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఈ విధంగా సమంత తన కెరియర్ లో ఎలా దూసుకుపోతోందో వ్యాపార రంగంలో కూడా అదే స్థాయిలో రాణిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా ఉందని చెప్పవచ్చు.