టాలీవుడ్ గ్లామర్ క్వీన్ సమంత ప్రస్తుతం జాను అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో హీరోగా యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్నాడు.
అలాగే ఈ చిత్రానికి సీ.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.అయితే తాజాగా సమంత ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.అలాగే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు విశేషాలను తన అభిమానులతో పంచుకుంది.
అయితే ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించినటువంటి 96 చిత్రానికి వివేక్ అయినప్పటికి తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పొందుతారని అన్నారు.అంతేగాక ఇప్పటివరకూ తాను నటించిన చిత్రాల్లో ఈ చిత్రంలోని జాను పాత్ర అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు.
ఎందుకంటే ఈ చిత్రంలోని జాను పాత్రలో అన్ని రకాల ఫీలింగ్స్, ఎమోషన్స్ పలికించిన తీరు తన నటన టాలెంట్ ని బయటికి తీసిందని అన్నారు.అయితే జాదు ఈ చిత్రం ఈ నెల 7వ తారీఖున విడుదల అవుతుందని కచ్చితంగా ప్రేక్షకులకి నప్పుతుందని థియేటర్లకు వేలి చూడాలని కోరారు.
అయితే ఇది ఇలా ఉండగా తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా చెబుతూ ప్రస్తుతం తాను ఫ్యామిలీ మెన్ సీజన్ 2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నానని అన్నారు.అదిగాక ఈ వెబ్ సిరీస్ ఉత్కంఠగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుందని ఇందులో తాను నెగటివ్ షేడ్ ఉన్నటువంటి పాత్రలో కనిపిస్తానని చెప్పుకొచ్చారు సమంత.అయితే ఇప్పటి వరకు ప్రేక్షకులు సమంత హీరోయిన్ ఓరియెంటెడ్ మరియు ఎమోషనల్ పాత్రలో మాత్రమే నటించగా ఇలాంటి నెగటివ్ షేడ్ పాత్రలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.