స్టార్ హీరోయిన్ సమంత 2020 లో కనీసం ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా కెమెరా ముందుకు రాలేదు.మొదటి రెండు నెలల్లో ఆమెకు జాను విడుదలకు సంబంధించిన హడావుడి.
ఆ తర్వాత కరోనా కారణంగా లాక్ డౌన్ ఆ తర్వాత హోం క్వారెంటైన్ ఇలా కెమెరా ముందుకు వచ్చేందుకు ఆమెకు ఈ ఏడాదిలో అవకాశం రాలేదు.సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు కొందరు.
కాని సమంత మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడి వారు అక్కడ ఉండటం మంచిది అంటున్నారు.
ఎట్టకేలకు ఆమె కెమెరా ముందుకు వచ్చారు.
సమంత ఇటీవల ఒక కమర్షియల్ యాడ్కు ఓకే చెప్పింది.ఆ యాడ్ చిత్రీకరణ కోసం ఒకటి రెండు రోజులుగా సమంత షూటింగ్లో పాల్గొంటుంది.
అయిదు రోజుల పాటు సమంతపై కొన్ని ఫొటో షూట్స్ మరియు యాడ్ ఫిల్మ్ ను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న ఈ కామర్స్ సంస్థ మింత్రతో సమంత ఒప్పందం చేసుకుంది.
అందులో భాగంగానే ఆమెతో యాడ్ చిత్రీకరణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవలే రానా పెళ్లిలో తెగ హడావుడి చేసిన ఈ అక్కినేని వారి కోడలు మింత్ర యాడ్తో ఈ నెలాకరు వరకు బుల్లి తెరపై ప్రత్యక్షం కాబోతుంది.ఇక సినిమాల్లో మాత్రం ఇప్పట్లో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు.ఇటీవలే ఈమె దసరా తర్వాతే షూటింగ్లో జాయిన్ అవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లుగా పేర్కొంది.
కనుక సమంత కొత్త సినిమాలు ఈ ఏడాదిలో విడుదల అయ్యే అవకాశం లేనట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.