టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.ఈమె నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత కూడా విపరీతమైన క్రేజ్తో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకు పోతుంది.
ఈ అమ్మడు తాజాగా ‘మన్మధుడు 2’ చిత్రంలో నటించింది.నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత గెస్ట్ రోల్ లో కనిపించబోతుంది.
కేవలం ఈ చిత్రం కోసం వారం రోజుల షూటింగ్, ఒక్క రోజు డబ్బింగ్కు డేట్లు కేటాయించడం జరిగిందట.
సమంత ‘మన్మధుడు 2’ కోసం కేటాయించిన డేట్లు కేవలం వారం రోజులే అయినా కూడా పారితోషికం ఏకంగా 35 లక్షల రూపాయలను తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత ఈ చిత్రం కోసం భారీ ఎత్తున పారితోషికం జరిగిందట.కేవలం వారం రోజులకు అంత పారితోషికం, అది కూడా నాగార్జున నిర్మిస్తున్న మూవీ అవ్వడంతో ఆమె పారితోషికం తీసుకోవడం చర్చనీయాంశం అవుతోంది.
మామ నిర్మిస్తున్న సినిమాలో సమంత ఫ్రీగా నటించి ఉంటుందని అంతా భావించారు.కాని అనూహ్యంగా సమంత 35 లక్షల పారితోషికం తీసుకుందనే ప్రచారం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.ప్రస్తుతం ఈ అమ్మడికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ పారితోషికం ఇవ్వాల్సిందే.కాని సొంత బ్యానర్లో మూవీకి పారితోషికంను సమంత డిమాండ్ చేయడం ఏంటీ, మరీ సమంత ఇంత కమర్షియల్ అయ్యి ఉంటుందా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరి కొందరు సినిమా, ఫ్యామిలీ వేరు వేరు అది కాకుండా మన్మధుడు 2 చిత్రాన్ని తానే స్వయంగా నిర్మించడం లేదు కనుక సమంతకు నాగార్జున స్వయంగా పారితోషికం ఆఫర్ చేసినట్లుగా కొందరు అంటున్నారు.మొత్తానికి మన్మధుడు 2 కోసం సమంత భారీగానే పారితోషికం తీసుకుంటుందనేది కన్ఫర్మ్.
మన్మధుడు 2 చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.