టాలీవుడ్ స్టార్ బ్యూటీ, అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వస్తోంది.గతేడాది జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, ఆ సినిమాతో నిరాశపరిచింది.
దీంతో తన నెక్ట్స్ చిత్రం విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది.ప్రస్తుతం దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్లో పీరియాడికల్ మూవీ ‘శాకుంతలం’ అనే సినిమాలో నటిస్తున్న సమంత ఈ సినిమాలో తన పాత్ర కోసం మేకోవర్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రం విషయంలో కూడా సమంత క్లారిటీగా ఉంది.
గతంలో ‘ఓ బేబీ’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకురాలు నందిని రెడ్డితో మరో సినిమా చేసేందుకు సమంత రెడీ అవుతోంది.
అయితే ఈ క్రమంలో తన రెమ్యునరేషన్ను అమాంతం పెంచేసిందట ఈ స్టార్ బ్యూటీ.ప్రస్తుతం నటిస్తున్న శాకుంతలం చిత్రం కోసం సమంత ఏకంగా రూ.3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.టాలీవుడ్తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా అదిరిపోయే ఫాలోయింగ్ ఉన్న బ్యూటీగా సమంత నిలవడంతో ఆమె తన రెమ్యునరేషన్ను పెంచేసిందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఏదేమైనా కొత్త హీరోయిన్లు కూడా తమ రెమ్యునరేషన్ పెంచేస్తుండగా, స్టార్ బ్యూటీ సమంత తన రెమ్యునరేషన్ పెంచితే తప్పేంటని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.ఇక సమంత నటించబోయే శాకుంతలం చిత్రాన్ని ఇటీవల అఫీషియల్గా లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను గుణశేఖర్ తన సొంత బ్యానర్పై ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాలో సమంత ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.మరి శాకుంతలం చిత్రం సమంతకు ఎలాంటి హిట్ అందిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.