స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం కారణంగా విజయ్ దేవరకొండ యొక్క సినిమా ఖుషి పూర్తి కాలేదు, సమంత ఆరోగ్యం సహకరించక పోవడం తోనే ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు జరగడం లేదంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆ మధ్య అనధికారికంగా పేర్కొన్నారు.హీరో మరియు దర్శకుడు ఎప్పుడు ఎప్పుడు సమంత వస్తుందా అంటూ ఎదురు చూస్తూ ఉన్నారట.
కొరియాకి సమంత చికిత్స కోసం వెళ్ళింది అంటూ ఆమె మేనేజర్ అధికారికంగా ప్రకటించాడు.అతి త్వరలోనే సమంత పూర్తి ఆరోగ్యం తో వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ప్రస్తుతం సమంత మరియు ఆమె నటిస్తున్న సినిమాల షూటింగ్స్ మధ్య లో ఉండటంతో గందరగోళంగా పరిస్థితి ఉంది.
విజయ్ దేవరకొండ తో ఆమె నటిస్తున్న సినిమా సగానికి పైన పూర్తయింది.శివ నిర్వాన దర్శకత్వం లో ఆ సినిమా రూపొందుతుంది.ఇప్పటికే సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవ్వాల్సి ఉంది.
ఆ వెంటనే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నానూరి దర్శకత్వం లో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నాడు.కానీ సమంత లేక పోవడంతో ఇప్పటి వరకు ఖుషి సినిమా నే పూర్తి అవ్వలేదు.
కనుక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో సినిమా ఎప్పటికీ ప్రారంభం అవుతుందో తెలియడం లేదు.ఆ సినిమా మాత్రమే కాకుండా మరో రెండు మూడు సినిమాలకు కూడా విజయ్ దేవరకొండ ఓకే చెప్పాడు.
కనుక ఆ సినిమాలు కూడా సమంత ఆరోగ్యం బాగా లేక పోవడంతో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.సమంత ఆరోగ్యం ఎప్పటికీ కుదుట పడుతుందో ఆమె మళ్ళీ షూటింగ్స్ కి ఎప్పుడు హాజరవుతుందో అంటూ విజయ్ దేవరకొండ అభిమానులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
సమంత నటించిన యశోద సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.