శాకుంతలం షూటింగ్ పూర్తి.. సమంత ఎమోషనల్ ట్వీట్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న “శాకుంతలం”అనే చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా సమంత ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో చిత్రబృందం ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.

 Samantha Had An Emotional Tweet On Completion Of Shakuntalam Shooting, Samantha-TeluguStop.com

ఈ వీడ్కోలుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.గత రెండు రోజుల క్రితం ఈ సినిమాలో శకుంతల కొడుకు భరతుడి పాత్రలో నటించిన అల్లు అర్హ షూటింగ్ పూర్తి కావడంతో ఆమెకు కూడా చిత్రబృందం ఘనంగా వీడ్కోలు పలికిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా సమంతా షూటింగ్ పూర్తయిన సందర్భంగా సమంత ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు.సినిమా షూటింగ్ పూర్తయింది.ఈ సినిమా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.ఇలాంటి సినిమాల్లో నటించాలని తన కోరిక అని, చిన్నప్పటి నుంచి ఎన్నో పురాతన కథలు వింటూ వచ్చాను.

ఇప్పటికీ కూడా అలాంటి కథలను చదువుతూ ఉంటానని తెలిపారు.

ఈ క్రమంలోనే గుణశేఖర్ ఈ కథను చెప్పినప్పుడు తనకు ఒక అందమైన ప్రపంచం కనిపించిందని,అయితే ఈ ప్రపంచానికి తగ్గట్టుగా నటిస్తానా? లేదా? అనే భయం తనలో కలిగిందని ఈ సందర్భంగా తెలిపారు.మొత్తానికి ఈ సినిమా నుంచి నాకు గుడ్ బై చెప్పే సమయం వచ్చింది.గుణ శేఖర్ సర్‌ మీద నాకు అంతులే గౌరవం పెరిగిపోయింది.

ఇంత మంచి సినిమాను తనకి ఇచ్చినందుకు గుణ శేఖర్ గారికి స్పెషల్ థాంక్స్ చెప్తూ సమంత ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube