ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ప్రతి ఒక్క హీరో కూడా పాన్ సినిమాలు అంటూ తమ మార్కెట్ ను పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.ఇప్పటికే ప్రభాస్ బాహుబలి మరియు సాహో సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
ఇక విజయ్ దేవరకొండ కూడా తన తదుపరి సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు.వీళ్లు మాత్రమే కాకుండా ఇంకా టాలీవుడ్ స్టార్ హీరోలు మరియు చిన్న హీరోలు కూడా హిందీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక్కడ చేసిన సినిమాలన్నీ కూడా అక్కడ విడుదల చేయాలని ముందస్తుగానే దర్శక నిర్మాతలు హీరోలు రిక్వెస్ట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.ఇక సౌత్ హీరోయిన్లు కూడా పాన్ ఇండియా సినిమాల దారిలో నడుస్తున్నట్లుగా తెలుస్తోంది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేసే నయనతార ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయలేక పోయింది.ఆ లోటును సమంత భర్తీ చేయబోతున్నట్లు అనిపిస్తోంది.ఆమె హీరోయిన్ గా ఒక పాన్ ఇండియా సినిమా రూపొందబోతోంది.ఆ సినిమాకు మొన్నటి వరకు తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో ఆ సినిమా బాధ్యతలను నందిని రెడ్డి చేపట్టినట్లు తెలుస్తోంది.వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే ఓ బేబీ సినిమా వచ్చింది.
ఆ సినిమా సూపర్ హిట్ అయింది.కనుక వీరిద్దరి కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందనే అభిప్రాయం ను సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే సమంత పాన్ ఇండియా మూవీ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.సౌత్ హీరోయిన్స్ లో మొదటి పాన్ సినిమా చేయబోతున్నది సమంత అంటూ ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.