ఏమాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత టాలీవుడ్ లో , కోలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగిన ముద్దుగుమ్మ సమంత.మొదటి సినిమాతోనే నటిగా ప్రూవ్ చేసుకొని తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోలు అందరితో ఇంచుమించు జతకట్టింది.
కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారి నెంబర్ వన్ హీరోయిన్ అయిన సమంత చివరిగా చేసిన కమర్షియల్ మూవీ రంగస్థలం.ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర అద్భుతంగా ఉంటుంది.
నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు పెళ్లి తర్వాత చాలా వరకు సినిమాలు తగ్గించేసింది.స్టార్ హీరోలకి జోడీగా కంటే సోలోగా లేడీ ఒరియాంటెడ్ కథలతో సత్తా చాటాలని ప్రయత్నం చేస్తుంది.
అందులో భాగంగా ఇప్పటికే హో బేబీ సినిమాతో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. మళ్ళీ ఇప్పుడు ఓ లేడీ ఒరియాంటెడ్ కథతోనే రావాలని ప్రయత్నం చేస్తుంది.
ఇదిలా ఉంటే పదేళ్ళకి పైగా హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ని కొనసాగించిన ఈ అమ్మడు గుర్తింపుకి కేవలం తనకి కలిసొచ్చిన అదృష్టమే అని చెబుతుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు మాట్లాడుతూ నేను ఇందాస్త్రీలోకి వచ్చే సమయానికి నాకంటే అందమైన అమ్మాయిలు, మంచి టాలెంట్ ఉన్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు.
అయితే నాకు మాత్రమే ఎక్కువ అవకాశాలు వచ్చాయి.స్టార్ ఇమేజ్ వచ్చింది అంటే దీనికి కారణం నా ప్రయత్నం కంటే నాకున్న అదృష్టం కారణమని భావిస్తాను.దేవుడు కృప లేకుంటే ఇదంతా సాధ్యం అయ్యేది కాదని నా అభిప్రాయం అంటూ క్రెడిట్ మొత్తం భగవంతుడుకి ఇచ్చేసింది.మొత్తానికి చాలా మంది హీరోయిన్స్ తరహాలో నా సక్సెస్ కి పూర్తిగా నేనే కారణం అని చెప్పకుండా దేవుడే కారణమని సమంత చెప్పిందంటే ఆమె ఆలోచన ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చని చాలా మంది ఆమె మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.
.