స్టార్ హీరోయిన్ సమంత చేసిన చిన్న పనికి ఇప్పటికి కూడా రూమర్స్ ఆగడం లేదు.అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని ఇంట అడుగు పెట్టింది.
టాలీవుడ్ లో చైసామ్ జంటకు మంచి పేరు ఉంది.ఎంతో అన్యోన్యంగా ఉండే జంటల్లో వీళ్ళు ముందు వరుసలో ఉంటారు.
పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.
అయితే ఈ మధ్య సమంత అక్కినేని పేరును తొలగించి S అనే లెటర్ పెట్టడంతో అప్పటి నుండి సమంత చైతన్య గురించి తీవ్రంగా చర్చలు సాగుతున్నాయి.
గత నెల రోజుల నుండి ఈ విషయంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి.అయితే వీటిపై అటు నాగ చైతన్య కానీ ఇటు సమంత కానీ స్పందించలేదు.
దీంతో ఈ వార్తలు నిజమేనని అంతా అనుకున్నారు.సమంత సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన ఈ విషయంపైనే నెటిజెన్స్ ప్రశ్నలు వేస్తున్నారు.తాజాగా సమంత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది.
వీఐపీ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకుంది.అక్కడ సమంత ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
దర్శనం తర్వాత ఆలయంలో నడుస్తుండగా సామ్ కు మళ్ళీ అదే ప్రశ్న ఎదురయ్యింది.
ఆమెను ఒక జర్నలిస్ట్ మీ విడాకులపై వస్తున్న రూమర్స్ పై సప్నదించమంటూ కోరారు.అయితే ఈ ప్రశ్నకు సామ్ సీరియస్ అయ్యింది.గుడికి వచ్చి ఇలాంటి ప్రశ్నలు వేయడానికి బుద్ధి ఉందా అంటూ అతడిపై ఫైర్ అయ్యింది.
ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే ఈ విషయంపై ఎప్పటికప్పుడు స్పందించకుండా ఇద్దరు తిరస్కరిస్తుండడంతో ఈ రూమర్ నిజమేనని అనుకుంటున్నారు.
వీలైనంత త్వరగా ఈ విషయంపై స్పందించి ఈ రూమర్స్ కు చెక్ పెట్టాలని అభిమానులు కోరుతున్నారు.