టాలీవుడ్ లో ఎంతో అన్యోన్యంగా ఉండే కపుల్స్ లో సమంత, నాగ చైతన్య ముందు వరుసలో ఉండే వారు.అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల సామ్, నాగ చైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
గత కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సామ్ నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే వీరి వివాహ బంధానికి నాలుగు సంవత్సరాలు కూడా నిండకుండానే విడాకులు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.
వీరు విడాకులు ప్రకటించి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా ప్రతి రోజు వీరి విడాకుల గురించి ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.కారణాలు చెప్పనప్పటికీ సమంత, నాగ చైతన్య విడాకులపై స్పందించారు.
మొన్నటి వరకు మాట్లాడని చైతూ బంగార్రాజు ప్రమోషన్స్ లో విడాకులపై మొదటిసారి స్పందించారు.ఆ తర్వాత గత రెండు రోజుల క్రితం నాగార్జున కూడా స్పందించినట్టు వార్తలు వచ్చాయి.
నాగార్జున బాలీవుడ్ మీడియాకు ఇచ్చినా ఇంటర్వ్యూ లో సమంతనే మొదట విడాకులు అడిగినట్టు నాగార్జున చెప్పారని వార్తలు వచ్చాయి.ఈ వార్తలు మీడియాలో హాట్ టాపిక్ అవ్వడంతో నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఆయన చెప్పినట్టు వస్తున్న వార్తలను ఖండిస్తూ.సమంత – నాగ చైతన్య గురించి తాను చెప్పినట్టు వస్తున్నా వార్తలన్నీ అవాస్తవం అంటూ తెలిపాడు.
అక్కడితో వస్తున్న రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడిన ఈయన చేసిన ట్వీట్ పై మిశ్రమంగా స్పదింస్తున్నారు.గతంలో ఈ వ్యవహారం లో సమంతదే తప్పు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చినప్పుడు అక్కినేని ఫ్యామిలీ ఎందుకు స్పందించలేదు అంటూ నాగ్ ను సామ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.సమంత భరణం ఎక్కువ అడిగినది, వేరే వ్యక్తితో సంబంధం పెట్టికుని చైతూని మోసం చేసిందని వచ్చిన పుకార్లపై ట్రోల్ చేసినప్పుడు నాగార్జున ఎక్కడున్నారు అని అడుగుతున్నారు.అప్పుడు స్పందించని నాగ్.
ఇప్పుడు తమ మీద రూమర్స్ వస్తే మాత్రం వెంటనే స్పందించారని అంటున్నారు.