సమంత ఒక తమిళ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన యువతి.కెరీర్ ఆరంభంలో ఆమె క్రిస్టియన్ గానే అందరికి తెలుసు.
క్రిస్మస్ వేడుకను వైభవంగా జరుపుకోవడంతో పాటు హిందూ దేవుళ్లకు సమంత దూరంగా ఉంటూ వచ్చేది.కాని ఇప్పుడు నాగచైతన్య కు భార్య అయిన తర్వాత ఆమె పూర్తిగా హిందూ భక్తురాలిగా మారిపోయింది.
తన సినిమా విడుదల సందర్బంగా తిరుమల శ్రీవారిని పాద నడక తో వెళ్లి దర్శించుకోవడం తో పాటు హిందువులకు సంబంధించి గుడులు మరియు మఠాలను పదే పదే సందర్శిస్తూ వస్తున్నారు.ఇటీవల ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన శివ రాత్రి ఉత్సవాలో్ల సమంత పాల్గొన్నారు.
కోయంబత్తూర్ లో ఈ వేడుక వైభవంగా జరిగింది.
ఈ వేడుకలో పాల్గొన్న సమంత సద్గురుతో కనిపించారు.
మంచు లక్ష్మి మరియు రకుల్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.సమంత ఆ కార్యక్రమంలో మంగ్లీ పాడిన పాటకు డాన్స్ కూడా చేశారు.
మొత్తానికి సమంతలో ఈ మార్పు చూసి అంతా కూడా అవాక్కవుతున్నారు.ఒక క్రిస్టియన్ అయిన సమంత తన భర్త మతం అయిన హిందుత్వంను స్వీకరించడంతో పాటు పూర్తిగా హిందు భావజాలంతో కూడిన మహిళగా మారడం అంటే మామూలు విషయం కాదు.
ఇక్కడ మతం గురించి కాదు కాని సమంత తన వారికి సంబంధించిన విషయాల పట్ల ఇచ్చే గౌరవంను అర్థం చేసుకోవచ్చు.సమంత నిజంగా ఈ విషయంలో అభినందనీయురాలు అనడంలో సందేహం లేదు.
సమంత ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది.ఇక తెలుగులో ఈమె శాకుంతలం సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.
త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.త్వరలో ఈమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.