టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సినిమాలకు గ్యాప్ ఇస్తుందని అందరూ అనుకున్నారు.నాగచైతన్యను విడిపోయినందుకు తను కాస్త ఒంటరిగా గడపడానికి కాస్త సినిమాలకు బ్రేక్ ఇస్తుందని అనుకున్నారు.
కానీ ఇప్పుడంత రివర్స్ గా మారింది.ఇకపై నో గ్యాప్ అంటూ వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది సమంత.
ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకీ పరిచయమైన సమంత ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో స్టార్ హీరోల సరసన ఓ రేంజ్ లో దూసుకుపోయింది.ఇక టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకోగా ఇటీవలే వీరిద్దరూ విడిపోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా ఉన్న ఈ జంట విడిపోయే సరికి తన అభిమానులు షాక్ అయ్యారు.ఇక సమంతను కూడా బాగా విమర్శలు చేశారు.
అంతేకాకుండా సమంతలో మార్పులు బాగా వచ్చాయి.ప్రస్తుతం సమంత దృష్టి మొత్తం బాలీవుడ్ పైనే ఉంది.ఇక ఆమె ఇటీవలే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలిసింది.
కానీ ఇకపై నో గ్యాప్ అన్నట్లుగా తాజాగా వరుస సినిమాలకు అవకాశం అందుకుంది.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయనుంది.ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది.
ఈ సినిమాకు కొత్త దర్శకుడిగా శంతరూబెన్ జ్ఞాన శేఖరన్ అనే వ్యక్తి పరిచయం కానున్నాడు.అంతేకాకుండా శివలెంక కృష్ణప్రసాద్ బ్యానర్ పై కూడా మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉంది.