టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాష ల్లో కూడా ఒకప్పుడు ఐటెం సాంగ్స్ కోసం హీరోయిన్స్ ప్రత్యేకంగా ఉండే వారు.వారిని హీరోయిన్స్ అనడం కంటే ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ లు అని.
వ్యాంప్ పాత్రలు వేసే నటీమనులు అనేవారు.కాని ఇప్పుడు పరిస్థితి మారింది.
బాలీవుడ్లో హీరోయిన్స్ ఎప్పుడో ఐటెం సాంగ్స్ చేయడం మొదలు పెట్టారు.ఇప్పుడు సౌత్ హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేయడం మొదలు పెట్టారు.
సమంత.కాజల్.
తమన్నా.పూజా హెగ్డే ఇలా పలువురు హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నారు.
ప్రస్తుతం పెద్ద ఎత్తున వీరికి పారితోషికాలు వస్తున్న కారణంగా ఐటెం సాంగ్ చేసేందుకు మొహమాట పడటం లేదు.ఇటీవల పుష్ప సినిమా లో ఐటెం సాంగ్ చేసినందుకు గాను ఏకంగా సమంతకు కోటి రూపాయల పారితోషికం వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇక గని సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేసింది.ఆ పాట ఇటీవలే విడుదల అయ్యింది.
ఆ ఐటెం సాంగ్ కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట ఆశ్చర్యంను కలిగిస్తున్నాయి.
సమంత కు సమానంగా తమన్నా పారితోషికం తీసుకుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పుకార్లు గుప్పుమంటున్నాయి .వీరిద్దరు ఐటెం సాంగ్స్ విషయంలో పోటీ పడుతున్నారు.ఇదే సమయంలో వారిద్దరు కూడా పారితోషికం లో కూడా పోటీ పడుతున్నారట.
సోషల్ మీడియాలో ప్రస్తుతం వీరిద్దరి ఐటెం సాంగ్స్ పోటీ పడుతున్నాయి.కనుక పారితోషికం విషయంలో పోటీ పడటం లో తప్పేం లేదు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి వీరిద్దరు కూడా ముందు ముందు మరిన్ని ఐటెం సాంగ్స్ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఏ విషయంలో అయినా పోటీ ఉండటం మంచిదే.
కనుక ఈ విషయంలో వీరిద్దరు కూడా పోటీ పడితే ఖచ్చితంగా మంచి ఎంటర్ టైన్ మెంట్ ప్రేక్షకులకు దక్కుతుందనే నమ్మకం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.సమంత హీరోయిన్ గా వరుసగా చిత్రాలు చేస్తూ ఉన్నా కూడా ఐటెం సాంగ్స్ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెబుతోంది.
ఇక తమన్నాకు హీరోయిన్ గా ఆఫర్లు తక్కువ వస్తున్నాయి.కనుక ఆమె ముందు ముందు మరిన్ని ఐటెం సాంగ్స్ చేసినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.