సౌత్ సినీ ఇండస్ట్రీలో నటీనటుల్లో ప్రస్తుతం యంగ్ కపుల్ గా సమంత, నాగ చైతన్య ముందున్నారు.వీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక పెళ్లి తర్వాత కూడా ఈ జంట ఓ సినిమాలో నటించగా.పెళ్లికి ముందు పలు సినిమాలలో నటించారు.అంతేకాకుండా వీరిద్దరు సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటారు.
2010లో ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఈ జంట కలిసి నటించగా.ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజ్జిగ వంటి సినిమాలలో జంటగా నటించారు.ఇక సినిమాలలోనే కాకుండా కమర్షియల్ యాడ్స్ లో కూడా ఈ జంట కలిసి నటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా మరో కమర్షియల్ యాడ్ షూట్ లో పాల్గొన్నగా.అక్కడ దిగిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
హైదరాబాద్ లో ఓ కమర్షియల్ యాడ్ షూట్ జరుగగా.అందులో కొన్ని ఫోటోలను, వీడియోను సమంత తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
అందులో సమంత, చైతన్య లుక్స్ ఆకట్టుకోగా.సమంత వెండి, గులాబీ రంగులో ఉన్న పట్టు చీర, టెంపుల్ జ్యూవలరీ ధరించింది.
నాగ చైతన్య లేత నీలం రంగు షూట్ ధరించాడు.ఇక వీరిద్దరూ కలిసి స్టిల్స్ ఇవ్వగా ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇదిలా ఉంటే ఇదివరకు ఓ సోప్ ప్రకటన చేయగా.ఇప్పటికీ అది బుల్లితెరలో ప్రసారమవుతుంది.
ఇక ఈ జంట ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.సమంత శాకుంతలం, నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా లో నటిస్తున్నారు.