సమంతా, నాగ చైతన్య విడిపోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.వారి విడాకులకు కారణాలు ఏంటి అనే అణ్వేషణలో ఉన్నారు నెటిజన్లు.
అయితే వీరిద్దరు విడిపోవడానికి పలు కారణాలతో పాటు వ్యక్తుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రధానంగా సమంతా, నాగచైతన్య విడిపోవడానికి కారణం అక్కినేని ఫ్యామిలీ సమంతా కెరీర్ ను కట్టడి చేసేందుకు ప్రయత్నించడం.
ఆమెను సినిమాలు తగ్గించుకోవాలని చెప్పడంతో పాటు, గ్లామర్ పాత్రలు, బోల్డ్ క్యారెక్టర్లకు దూరంగా ఉండాలని ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది.అయితే కెరీర్, స్టార్ డమ్ విషయంలో తాను రాజీ పడబోనని సమంతా చెప్పడం వల్లే విడాకుల వరకు వ్యవహారం వెల్లిందనే టాక్ నడుస్తుంది.
ఈ విషయాలు పక్కన పెడితే వీరి విడాకులు వెనుకు కొందరు వ్యక్తుల ప్రమేయం ఉందనే వార్తలకు కూడా వినపడుతున్నాయి.సమంతా తన మాట లెక్క చేయకుండా స్కిన్ షో చేయడం పట్ల చై హర్ట్ అయినట్లు తెలుస్తోంది.
అందుకే తను తాజాగా నటించిన లవ్ స్టోరీ హీరోయిన్ సాయి పల్లవితో చై కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది.ఆమెతో చూ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.సాయి పల్లవి గ్లామర్ పాత్రలకు, స్కిన్ షోలకు దూరంగా ఉంటుంది.తాను అలాంటి పాత్రలు చేయబోనని తేల్చి చెప్పింది.
అందుకే సాయి పల్లవితో చై చనువుగా ఉంటున్నట్లు తెలుస్తోంది.విడాకుల విషయంలో ఈ కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అటు ఈ విడాకులు వెనుక అమీర్ ఖాన్ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.ఈవిషయాన్ని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వెల్లడించింది.తాజాగా చై, అమీర్ ఖాన్ సినిమాలో నటించాడు.ఈ సందర్భంగా విడాకులు తీసుకునేందుకే ఓకే చెప్పాలని అమీర్ చెప్పినట్లు కంగనా వెల్లడించడం తాజాగా సంచలనం అయ్యింది.
అటు ధనుష్ తో సినిమా తీసేందుకే సమంతా ఈ విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది.అయితే ఈ వార్తలు ఏమాత్రం నిజమో ఎవరికీ తెలియదు.నిజానికి వీరి మధ్య సఖ్యత గత ఏడాది నుంచి సరిగా లేదు.కానీ ఇప్పుడిప్పుడు వచ్చిన వీరి మూలంగా వారిద్దరు విడాకులు తీసుకున్నారనడం ఆశ్చర్యం కలిగిస్తుందంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు.