టాలీవుడ్ స్టార్ హీరోయిన్సమంత ప్రధాన పాత్రలో గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.ఇటీవలే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.
ఆమెకు సంబంధించిన షూటింగ్ ను ముగించిన చిత్ర యూనిట్ సభ్యులు ఆ తర్వాత సమంత షూటింగ్ ను కూడా ముగించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.మొత్తానికి శాకుంతలం సినిమా షూటింగ్ సమంత పేకప్ తో ముగిసిందని అంతా అనుకుంటూ ఉన్న సమయంలో అనూహ్యంగా యుద్ద సన్నివేశంను మొదలు పెట్టినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొనడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
శాకుంతలం సినిమాలో యుద్ద సన్నివేశాలు భారీ ఎత్తున ఉండబోతున్నాయి.ఆ యుద్ద సన్నివేశాల్లో సమంత కనిపించదు.కేవలం హీరో మాత్రమే ఉంటాడు.సమంత ప్రధాన పాత్రలో అంటూ చెబుతున్న ఈ సినిమా లో కీలకమైన యుద్ద సన్నివేశాలు ఆమె లేకుండా తీయడం వల్ల ఎలా ఇది హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు.
సమంత అభిమానులు కూడా యుద్ద సన్నివేశాలు ఉంటే ఆమె సన్నివేశాలు నిరాసపడిపోయే అవకాశం ఉంది కదా అంటూ కొందరు అంటున్నారు.ఆమె క్రేజ్ తగ్గించినట్లు అవుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి యుద్ద సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత సినిమా షూటింగ్ కు గుణ శేఖర్ గుమ్మడి కాయ కొట్టబోతున్నాడు.భారీ ఎత్తున జనాలు మరియు టెక్నీషియన్స్ తో ఈ సినిమా యుద్ద సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. సమంత శాకుంతల గా నటిస్తున్న ఈ సినిమాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ ముగించిన గుణశేఖర్ విడుదలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి హింట్ ఇవ్వలేదు.ఇప్పటి వరకు షూటింగ్ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టిన ఆయన ఆ తర్వాత గ్రాఫిక్స్ వర్క్ చేయించబోతున్నాడు.
వచ్చే ఏడాది వరకు ఈ సినిమా కోసం వెయిట్ చేయాల్సి రావచ్చు.