టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు.
కాగా ఈ సినిమా అందించిన సక్సెస్తో తన నెక్ట్స్ మూవీ ‘పుష్ప’ను తెరకెక్కించేందుకు బన్నీ రెడీ అయ్యాడు.ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టిన ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తరకెక్కిస్తున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.
కాగా ఈ సినిమాతో మరోసారి తమ కాంబోలో అదిరిపోయే సక్సెస్ను అందుకునేందుకు బన్నీ-సుక్కు రెడీ అవుతున్నారు.కాగా ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది.
అయితే తొలుత ఈ సినిమాలో బన్నీ సరసన నటించేందుకు స్టార్ బ్యూటీ సమంతను సంప్రదించారట చిత్ర యూనిట్.గతంలో బన్నీతో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించిన సమంత, మరోసారి బన్నీతో నటిస్తే బాగుంటుందని పుష్ప చిత్ర యూనిట్ అనుకుంది.
గతంలో సుకుమార్ డైరెక్షన్లో విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ రంగస్థలంలో నటించిన సమంత పుష్ప సినిమాలో కూడా అలాంటి పాత్రే రావడంతో నో అని చెప్పిందట.దీంతో సుకుమార్ ఈ ఆఫర్ను రష్మికకు ఇచ్చాడట.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేదనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.ఏదేమైనా బన్నీతో సినిమాకు నో చెప్పిన సమంత అసలు ఎందుకు అలా చెప్పిందో అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు.