అక్కినేని సమంత సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దుమ్ము దులుపుతున్నారు.చేతి నిండా సినిమాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత కరోనా వల్ల ప్రస్తుతం ఎలాంటి సినిమాలను చేయకుండా కొంత విరామం తీసుకున్నారు.
అయితే తన మొదటి సినిమా ఏం మాయ చేసావ్ లో అక్కినేని నాగచైతన్య సరసన నటించి ఎంతోమంది కుర్రకారులను తన మాయలో పడేసింది.
సమంత తను మొదట సినిమాలో నటించిన నాగ చైతన్య ని పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అడుగుపెట్టింది.
వరుస విజయాలతో ఎంతో పేరుప్రఖ్యాతులు గాంచిన సమంత ప్రస్తుతం ఎటువంటి సినిమాలను చేయకుండా కొద్దిగా విరామం తీసుకున్నారు.అయితే ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా ఆహా యాప్ ద్వారా సామ్ జామ్ అనే టాక్ షో కి వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్నారు.
అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమయ్యే”ఫ్యామిలీ మాన్” అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే సమంత తాజాగా తన కొడుకు అక్కినేని యశ్ పుట్టినరోజు జరుపుకుంటున్నట్లు ఒక క్యూట్ ఫోటోను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.
యశ్ అంటే సమంత పెంచుకునే కుక్క పిల్ల. ఈ కుక్క పిల్ల చేసే అల్లరి పనులకు, చిలిపి చేష్టలకు తెగ ఎంజాయ్ చేస్తున్న సమంత దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు.
దీనికి అల్లరికి సంబంధించిన కొన్ని వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
ప్రస్తుతం సమంత తన భర్త నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా మాల్దీవులకు వెళ్లి పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
వీరిద్దరూ మాల్దీవుల్లోని ఉత్తరాన ఉన్న ఒక ద్వీపంలో ఎంజాయ్ చేస్తున్నట్లు, సమంత అక్కడ స్కూబా డైవింగ్ కూడా చేశారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను సమంత తన అభిమానులతో పంచుకున్నారు.