ఏం మాయ చేసావే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన చెన్నై భామ సమంత మొదటి సినిమాతోనే మంచి కథానాయికగా పేరుగాంచింది.తర్వాత టాప్ హీరోల సరసన నటిస్తూ ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ హీరోయిన్ ఎదిగారు.
ఏం మాయ చేసావే సినిమాలో తనతో పాటు నటించిన అక్కినేని నాగచైతన్యతో పరిచయం కాస్తా ప్రేమగా మారి చివరికి అందరినీ ఒప్పించి వివాహం చేసుకున్నారు.అయితే వీళ్లిద్దరి వివాహం గురించి అప్పట్లో చాలా చర్చలు జరిగాయి.
నేషనల్ స్థాయిలో కూడా వీరి వివాహం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
పెళ్లి తర్వాత కూడా అంది వచ్చిన అవకాశాలను చేజార్చుకోకుండా.
సినిమాల్లో నటించి అత్యంత ఆదరణ పొందారు సామ్.సంప్రదాయ పాత్రలతోనే సరిపెట్టుకోకుండ .లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ఓ స్థాయిని ఏర్పరుచుకున్నారు.సినితారాల వ్యక్తిగత విషయాలంటేనే సామాన్య ప్రజలకు ఆసక్తి ఎక్కువ.
వాళ్ల జీవితాల్లో ఏం జరిగినా.తెలుసుకోవడానికి అత్యంత ఇంట్రస్ట్ చూపిస్తారు.
అయితే గత కొద్ది రోజుల నుంచీ సమంత – నాగచైతన్య విడిపోతున్నారు అంటూ ప్రచారం మొదలవగా.తాజాగా ఈ విషయం మీద సమంత పరోక్షంగా స్పందించారు.
ఇది చాలా చిన్న విషయమని చెబుతూనే ఇలాంటి వాటికి ఏమని స్పందించినా సరే అది కాంట్రవర్సీ అవుతోందని ఆమె అన్నారు.
నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా సమంత ఆయనకు శుభాకాంక్షలు చెబుత .నాగార్జున మామ అని సంబోధించడంతో వీరిద్దరూ విడిపోవడం అసత్యమని అభిమానులు భావించారు.ఈ వార్తలపై ఇంత ప్రచారం జరుగుతున్నా అటు సమంత గానీ ఇటు నాగచైతన్య నుంచి గానీ ఎలాంటి స్పందన రాకపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.
తాజాగా సోషల్ మీడియా వేదికగా సమంత.రెండు ఫోటోలను అనుసంధానం చేస్తూ షేర్ చేసింది.అవి రెండు కుక్క పిల్లలకు సంబంధించిన ఫోటోలు కాగా మొదటి దానిలో ఒక కుక్క గాండ్రిస్తూ పళ్ళన్నీ బయటపెట్టి ఉన్నట్లు ఉంది.దాన్ని మీడియాగా సంబోధించిన సమంత .కింద మరో రెండు కుక్కపిల్లలు ప్రశాంతంగా ఉన్న ఫొటోలు పెట్టింది.అంటే ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని కూడా ఇలా గందరగోళంగా ఏదో జరిగిపోతోంది అన్నట్లుగా చూపించడంలో మీడియా ముందు ఉంటుందనే సంకేతాలు ఆమె ఈ ఫోటోల ద్వారా వ్యక్త పరిచింది.
దీంతో ఎలాంటి విడాకులకు సంబంధించిన వ్యవహారం నడవడం లేదు అనే విషయాన్ని ఆమె క్లారిటీగా చెప్పినట్లయింది.ఇప్పటికైనా ఈ విడాకుల వార్తలు ఆగుతాయో లేదో అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి మరి.ప్రస్తుతం సమంత తెలుగులో ఒకటి, తమిళంలో మరొక సినిమా చేస్తున్నారు.ఈ సినిమాల తర్వాత కాస్త విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.