సమంత అక్కినేని.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
పదేళ్ల క్రితం సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా అవతరించింది.ఎన్నో అద్భుత సినిమాల్లో నటించిన ఈ భామ అందానికి అందం నటనకు నటన.మొదటి సినిమాతో నే అక్కినేని వారసుడు నాగ చైతన్యను పడేసిన సమంత 2017 లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.
ఇక పెళ్లి తర్వాత కూడా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తున్న ఈ అందాల రాణి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానుల కు ఆరోగ్యంపైనా.
గార్డెనింగ్ పైనా ఎన్నో సలహాలు ఇస్తుంటుంది.ఇక ఈ భామ మామ.నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.అయితే వైల్డ్ డాగ్ షూటింగ్> కోసం వేరే ప్రాంతానికి వెళ్తూ.
బిగ్ బాస్ హౌస్ బాధ్యత అంత కూడా కోడలు సమంత చేతిలో పెట్టాడు.
ఇంకేముంది.
సమంత వచ్చింది రచ్చ రచ్చ చేసింది. వావ్ సమంత అనేలా చేసింది.
తనకు తెలుగు సరిగ్గా రాకపోయినా సరే ఎంతో చక్కగా ఎక్కడ తప్పులు లేకుండా దసరా పండుగా రోజు అద్భుతంగా షో ని నడిపించింది.ఇక అలా షోలో ఉన్నప్పుడే మోనాల్ తో మాట్లాడుతూ.
ఏదైనా కూడా క్లియర్ గా చెప్పాలి.అప్పుడే మనకు ఎవరైనా.
ఏ పని అయినా చేసి పెడుతారు.అని చెప్పిన సమంత.
ఆమె కూడా క్లియర్ గా మాట్లాడి చెప్తేనే చైతు చేస్తాడని.ఏడుస్తూ చెప్తే కోపం తెచ్చుకుంటాడని.
ఏది చెయ్యడని చెప్పుకొచ్చింది.దీంతో ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.