స్టార్ హీరోయిన్ సమంత దశాబ్ద కాలం నుంచి తన హవాని కొనసాగిస్తూ వస్తుంది.హీరోయిన్ గా ఆమె ఎంత గుర్తింపు సొంతం చేసుకుందో అంతే స్థాయిలో ఆమె చేసే సోషల్ సర్వీస్ తో తెచ్చుకుంది.
ఖాళీ సమయం దొరికితే ఏదో ఒక వ్యాపకం పెట్టుకునే సమంత అక్కినేని ఇంటికి కోడలు అయిన తర్వాత ఒకప్పటిలా ఎక్కువ సినిమాలు చేయడం లేదు.కేవలం మనసుకి నచ్చే పాత్రలు వచ్చినప్పుడు మాత్రమే సినిమాలు చేస్తుంది.
అలాగే లేడీ ఓరియెంటెడ్ కథలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.ప్రస్తుతం ఆమె తమిళంలో విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తూ ఉండగా మరో వైపు ది ఫామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.
ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఇక తాజాగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో ముచ్చటించిన సమంత అభిమానులకి సారీ చెప్పింది.
తాను ఎన్ని సార్లు కామెంట్స్ పెట్టిన మీరు పట్టించుకోవడం లేదని ఓ అభిమాని ప్రశ్నించగా, దానికి ఆమె అన్ని కామెంట్స్ కి సమాధానాలు ఇవ్వలేకపోతున్నందుకు అభిమానులు అందరికి సారీ చెబుతున్నట్లు తెలిపింది.మీ అందరి అభిమానం ఉంది కాబట్టి మేము స్టార్స్ గా ఉన్నాం అని చెప్పింది.
అదే సమయంలో తన గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.జీవితంలో చివరిగా ఏడ్చింది ది ఫామిలీ మెన్ వెబ్ సిరీస్ చూసినపుడు ఆనందంతో ఏడ్చానని చెప్పింది.
నగర శివారులో రైతులతో కలిసి వ్యవసాయం చేయమని ఒక అభిమాని సలహా ఇవ్వగా, సలహా బాగుందని కచ్చితంగా ప్రయత్నం చేస్తానాని సమంత చెప్పుకొచ్చింది.అలాగే తనకి ఇష్టమైన పాత్రలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవని, అయినా చేసిన పాత్రలు లాంటివే మళ్ళీ కాకుండా కొత్తదనం ఉన్న పాత్రలు చేయాలనీ అనుకుంటున్నట్లు తెలియజేసింది.
అలాగే తాను భాగస్వామ్యం అయినా ఏకమ్ ప్రీ స్కూల్ గురించి మాట్లాడుతూ, పిల్లలకి పుస్తకాలు ఒకటే విద్య కాదని, అంతకు మించి వారిలో సృజనాత్మకత పెంచే విద్య అందించాలని ప్రీ స్కూల్ మొదలు పెట్టినట్లు తెలిపింది.