అఖిల్ చేసిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.ఏ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు.
దాంతో బొమ్మరిల్లు భాస్కర్ను నమ్మి నాగార్జున అఖిల్4వ సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు.గీతాఆర్ట్స్లో రూపొందుతున్న అఖిల్ 4వ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.
వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.అఖిల్ కు ఈ సినిమా సక్సెస్ చాలా చాలా అవసరం అనే విషయం అందరికి తెల్సిందే.
ఈ చిత్రంలో అఖిల్కు జోడీగా ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ అండ్ మోస్ట్ బిజీ హీరోయిన్ అయిన పూజా హెగ్డే ఈ చిత్రంలో నటిస్తున్న కారణంగా ఖచ్చితంగా సినిమాకు ఆమె ప్లస్ అవుతుందని అంటున్నారు.బొమ్మరిల్లు భాస్కర్ చాలా విభిన్నమైన సినిమాలు చేస్తాడు.అందుకే ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు.
ఇలాంటి సమయంలోనే సినిమా గురించిన మరో ఆసక్తికర వార్త ఒకటి సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.అఖిల్ 4 సినిమాలో ఒక చిన్న గెస్ట్ రోల్ కోసం ముద్దుగుమ్మ సమంతను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.అఖిల్కు వదిన అయిన సమంత ఈ చిత్రంలో కనిపించబోతుండటంతో సినిమాకు ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.