సమంత అక్కినేనిఈ పేరుకి పెద్ద పరిచయం అక్కర్లేదు అనే చెప్పాలి.ఏమాయ చేసావే సినిమాతో జెస్సీగా మన తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఆ సినిమాలో సమంత నటనకు, మాటలకూ, అందానికి అప్పటి యూత్ అంతా పడి చచ్చేవారు.అప్పుడు మొదలయిన సమంత సినీ ప్రయాణం ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది.
ఇన్నేళ్లు అయినాగానీ సమంత ఇప్పటికి ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోయిన్ కొనసాగుతూనే ఉంది.హీరో నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కినేని ఇంట అడుగు పెట్టింది సమంత.
సమంత సినీ ప్రస్థానం మొదలుపెట్టి ఫిబ్రవరి 25 తో 11 యేళ్ల కెరీర్ కంప్లీట్ చేసుంది.ఈ పదకొండేళ్ల కాలంలో సమంత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అందరిని మెప్పించింది అలాగే హీరోయిన్ గా మాత్రమే కాకుండానే, లేడీ ఓరియంటెడ్ పాత్రలలో కూడా నటించి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది.
సమంత మొదటి తెలుగు సినిమా ఏ మాయ చేశావే ఈ సినిమాలో జెస్సీ గా సమంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.ఆ సినిమా బంపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ బృందావనం లో ఇందుగా గ్లామర్ పాత్రలో మెరిసింది.
ఆ తర్వాత హేష్ బాబు దూకుడు లో మోడల్ ప్రశాంతిగా మెప్పించింది.ఈ మధ్యకాలంలో కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించింది.ఆ తర్వాత అత్తారింటికి దారేదిసినిమాలో పవన్ తో నటించింది.
ఆ తర్వాత అక్కినేని కుంటుంబం మొత్తం కలిసి నటించిన మనం సినిమాలో ప్రియగా నటించింది.తరువాత రంగస్థలం లో పల్లెటూరి యువతి రామలక్ష్మి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే.ఆ తర్వాత తన భర్త నాగ చైతన్యతో చేసిన మజిలీ లో సామాన్య గృహిణిగా మెప్పించింది.
నేడు సమంత హీరోయిన్గా పదకొండేళ్లు పూర్తి చేసుకుంది.నటిగా 12వ వసంతంలోకి అడుగుపెట్టింది సమంత కరోనా సమయం లోనే ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్లో విలన్ పాత్రలో నటించింది.
మరోవైపు ఆహా ఓటీటీ ఫ్లాట్ఫామ్లో సామ్ జామ్ అంటూ సందడి చేసింది.త్వరలో గుణశేఖర్ దర్శకత్వంలోశాకుంతలం సినిమాతో పలకరించబోతుంది.సమంత తన కెరీర్లో చేస్తోన్న తొలి పౌరాణిక సినిమా ఇదే.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది.ఇన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో సమంత కొనసాగిందంటే గ్రేట్ అనే చెప్పాలి కదా
.