స్టార్ హీరోయిన్ సమంత గతేడాది ఆహా ఓటీటీలో సామ్ జామ్ అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.అయితే ఈ షో ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.
సమంత ఎంతో కష్టపడినా ప్రేక్షకుల్లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గెస్టులు వచ్చినా ప్రేక్షకులు మాత్రం ఈ షోను ఏ మాత్రం పట్టించుకోలేదు.ఆహా ఓటీటీకి సామ్ జామ్ షో వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదు.
అయితే సమంత వల్ల కానిది బాలయ్య మాత్రం సాధించారు.
బాలయ్య అన్ స్టాపబుల్ షో ప్రోమోలు ప్రేక్షకుల్లో అంచనాలను భారీస్థాయిలో పెంచడంతో పాటు ఈ షో మొదలైన తర్వాత ఆహా ఓటీటీకి సబ్ స్క్రిప్షన్లు కూడా పెరుగుతున్నాయని సమాచారం అందుతోంది.
ఆహా ఓటీటీపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికి ఆ ఓటీటీ బృందం ఎంతో శ్రమిస్తోంది.ఇప్పటికే ఈ ఓటీటీ చాలా షోలు ప్లాన్ చేసినా ఇతర షోలతో పోలిస్తే అన్ స్టాపబుల్ మాత్రమే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుందని చెప్పాలి.
ఫస్ట్ ఎపిసోడ్ కు మోహన్ బాబు గెస్ట్ గా రావడంతో పాటు వివాదాస్పద ప్రశ్నల గురించి చర్చించడంతో ఆ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అన్ స్టాపబుల్ షోకు హిట్ టాక్ తీసుకురావడంలో బాలయ్య సక్సెస్ అయ్యారు.
ఈ షో ప్రారంభం కావడానికి ముందు ఎన్నో ప్రశ్నలు, సందేహాలు వ్యక్తమైనా బాలయ్య తన హోస్టింగ్ తో ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.నానితో బాలయ్య చేసిన అల్లరి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బాలయ్య షోకు భవిష్యత్తులో మరింత క్రేజ్ ఉన్న స్టార్స్ రాబోతున్నారని సమాచారం అందుతోంది.ఎవరు మీలో కోటీశ్వరులు షోకు స్టార్ హీరోలు, హీరోయిన్లు హాజరవుతున్నా ఆ ఎపిసోడ్లకు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రావడం లేదు.ఒక విధంగా బాలయ్య తారక్ కంటే పై చేయి సాధించారని చెప్పాలి.