టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సమంత నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి నేటికి సరిగ్గా నెల రోజులు అవుతున్న వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ క్రమంలోనే సమంత విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలన్నింటిని అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా వేదికగా రోజు ఎన్నో పోస్టులను చేస్తున్నారు.
తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
తాజాగా సమంత తన రెండు కుక్క పిల్లలకు సంబంధించి మార్నింగ్ మ్యాడ్నెస్ అంటూ పోస్ట్ చేయడమే కాకుండా న్యూ బ్రింగింగ్ బ్యాక్ అంటూ తన ఇంటికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే విడాకులకు ముందు సమంత చైతన్యతో కలిసి ఈ ఇంట్లోనే నివసించింది.
దీన్ని బట్టి చూస్తుంటే సమంత చైతన్యతో విడాకుల తర్వాత కూడా ఒంటరిగా ఈ ఇంట్లోనే నివసించాలని భావిస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక నాగచైతన్య గత ఏడాది జూబ్లీహిల్స్ లో కొన్న ఒక విలాసవంతమైన భవనంలో ఒంటరిగా గడపడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ భవనంలో రెనోవేషన్ పనులు జరుగుతుండడంతో నాగచైతన్య అక్కడే ఒక అపార్ట్మెంట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.