టాలీవుడ్ లో చాలా కాలంగా ఒక సాలిడ్ హిట్ కోసం పరితపిస్తున్న నటుడు మంచు విష్ణు.వరుసగా సినిమాలు చేస్తున్న అతను నటించిన అన్ని సినిమాలు ఎంటర్టైనర్ సినిమాలుగా పర్వాలేదని టాక్ మాత్రమే తెచ్చుకుంటున్నాయి.
కొత్తదనం లేకపోవడంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ అనుకున్న స్థాయిలో కుదరకపోవడంతో మంచు విష్ణు సినిమాలు ఇండస్ట్రీ హిట్ అనిపించుకోలేకపోతున్నాయి.నటుడుగా ఇప్పటికే తనని తాను ప్రూవ్ చేసుకున్న మంచు విష్ణు ఈ సారి తన రేంజ్ చూపించాలని, నటుడుగా మరో మెట్టు ఎక్కడంతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టాలని కసిగా మోసగాళ్లు సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాలో అతనే హీరో, ఇక స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో మంచు విష్ణు చెల్లెలుగా నటించడం ప్రత్యేకత.ఇక రియల్ స్టోరీని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా కథని తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు.
ఈ సినిమాకు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు.శ్యామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.మోసగాళ్లు టైటిల్ కీ థీమ్ మ్యూజిక్ ఇటీవల ద రైజ్ ఆఫ్ మోసగాళ్లు పేరిట విడుదల చేశారు.ఆసక్తికరంగా ఉన్న ఈ థీమ్ మ్యూజిక్ బాగా పాపులర్ అయింది.
కుర్చీల్లో కదలకుండా కూర్చుని చూసే థ్రిల్లర్గా మా చిత్రం ఉంటుందనే అభిప్రాయాన్ని థీమ్ మ్యూజిక్ కలిగించింది.సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి కృషి చేస్తున్నారు.
ఇక కథ విషయానికొస్తే భారత్లో మొదలై, అమెరికాను వణికించిన చరిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది అని చిత్ర యూనిట్ పేర్కొంది.మంచు విష్ణు అయితే ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకోవడంతో పాటు గట్టి నమ్మకంతో ఉన్నాడు.
దీంతో అటు నిర్మాతగా, ఇటు హీరోగా సక్సెస్ అవుతానని భావిస్తున్నాడు.