భారత ప్రతి క్రికెట్ అభిమాని ప్రస్తుతం విరాట్ కోహ్లీకి వందనం చెబుతున్నాడు.వరుసగా అద్బుత ఇన్నింగ్స్లు ఆడుతూ జట్టుకు అద్బుత విజయాలను అందిస్తున్న విరాట్ కోహ్లీ మరోసారి ఆస్ట్రేలియాపై విరుచుకు పడి, మరో చిరస్మరనీయ విజయాన్ని భారత్కు అందించాడు.తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సహచరులు ఒక్కరొక్కరిగా వెనుదిరుగుతున్న సమయంలో, బంతి బౌలర్కు సహకరిస్తుండగా, విరాట్ కోహ్లీ వీరోచితంగా నిలిచి జట్టును గెలిపించాడు.టీ20 వరల్డ్ కప్లో జట్టుకు అద్బుత విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా ఉన్నాడు
టీ20 ప్రపంచ కప్లో సెమీస్కు వెళ్లాలి అంటే ఆస్ట్రేలియాతో గెలవాల్సిన పరిస్థితి.ముందు నుండే కోహ్లీ ఫామ్లో ఉండటంతో అంతా కూడా ఆయనపైనే భారం వేశారు.తనపై అభిమానులు ఉంచిన నమ్మకాన్ని విరాట్ కోహ్లీ ఏమాత్రం వమ్ము చేయలేదు.ఒత్తిడిలో తనదైన శైలిలో ఆడి జట్టుకు కీలక విజయాన్ని అందించాడు.ఈ విజయంతో భారత్ టీ20 ప్రపంచ కప్ సెమీస్కు దూసుకు పోయింది.
కప్పై అభిమానుల్లో ఆశలు మరింతగా పెరిగాయి.కోహ్లీ అద్బుత ఆట తీరును ప్రధాన మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రశంసించారు.
ఆయన అభిమానులు వీరుడా నీకు వందంనం అంటూ సెల్యూట్ చేస్తున్నారు.సెమీస్ మరియు ఫైనల్స్లో కూడా కోహ్లీ ఇదే ఆటతీరును ప్రదర్శిస్తే మరోసారి భారత్ కప్పును ముద్దాడటం పెద్ద సమస్య కాదు అని విశ్లేషకులు అంటున్నారు.