ప్రపంచం మొత్తం కారణం వైరస్ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎన్నో కుటుంబాలు వారి ఇంట్లోనే వ్యక్తులను కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ఈ పరిస్థితిని నుండి బయట పడేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది శాస్త్రజ్ఞులు కరోనా వైరస్ ను అరికట్టే దిశగా వ్యాక్సినేషన్ ను కనుగొన్నారు.ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ ను కొద్దిమేర అదుపులోకి తీసుకురాగలిగారు.
ఈ వ్యాక్సిన్ ద్వారా చాలా తక్కువ మందికి మాత్రమే కొన్ని రియాక్షన్స్ రాగా చాలావరకు సరిగానే పనిచేస్తోంది.
శాస్త్రవేత్తలు ఇంత కష్టపడి చివరికి వాటి వల్ల కొంత మంది ఇబ్బందులు పడ్డారని.
ఆ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ఇప్పటికీ ప్రపంచంలో చాలా మంది వెనకడుగు వేస్తున్నారు.అలాంటి వారి కోసం అనేక దేశాలలో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ వారిని వ్యాక్షిన్ చేయించుకునేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
ఈ విషయంలో కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాకుండా కొందరు సామాజిక నేపథ్యంలో భాగంగా వారి వంతు కృషి చేస్తున్నారు.ఇందులో భాగంగానే తాజాగా తమిళనాడులో మధురై నగరానికి చెందిన కార్తికేయన్ అనే సెలూన్ యజమాని ఈ వినూత్న ఆఫర్ ప్రకటించాడు.
ఎవరైతే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్లు తన సెలూన్ లో క్షవరం చేయించుకుంటే వారికి 50 శాతం డిస్కౌంట్ ఇస్తానని తెలిపాడు.
కేవలం ప్రజల్లో టీకాలపై అవగాహన పెంచేందుకు అతను ఈ ఆఫర్ ఇస్తున్నానని కార్తికేయన్ తెలిపాడు.మరోసారి దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలన్నా, అలాగే థర్డ్ వేవ్ రాకుండా ఉండాలన్నా కచ్చితంగా కరోనా టీకా వేయించుకోవాలని తన దగ్గరకు వచ్చే కస్టమర్లకు అతను అవగాహన కలిపిస్తున్నడు.