ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నంబర్ 1 హీరో అనే సంగతి తెలిసిందే.సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.
అయితే ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ తాజాగా సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.సల్మాన్ ఖాన్ తండ్రి అబ్దుల్ రషీద్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలకు రచయితగా పని చేశారు.
అబ్దుల్ రషీద్ పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.అయితే సల్మాన్ ఖాన్ మాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ మొదట దర్శకుడు కావాలని అనుకున్నారట.స్వయంగా జాకీ ష్రాఫ్ ఈ విషయాలను వెల్లడించారు.కొందరు డైరెక్టర్ల దగ్గర సల్మాన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారని కూలి వాళ్లు ఏ పనులు అయితే చేస్తారో సల్మాన్ సెట్స్ లో ఉన్న సమయంలో అలాంటి పనులే చేసేవారని జాకీ ష్రాఫ్ అన్నారు.
గడిచిన మూడు సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ తనకు తెలుసని ఆయన అన్నారు.
1988 సంవత్సరంలో ఫలక్ అనే సినిమాకు సల్మాన్ పని చేస్తున్న సమయంలో సల్మాన్ తన బూట్లతో పాటు బట్టలు కూడా మోశారని జాకీ ష్రాఫ్ చెప్పుకొచ్చారు.అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలోనే హీరో కావాలని సల్మాన్ ఖాన్ అనుకున్నారని సల్మాన్ హీరో కావడానికి తాను సహాయం చేశానని జాకీ ష్రాఫ్ తెలిపారు.
సల్మాన్ ఖాన్ కు మైనే ప్యార్ కియా అనే సినిమాలో ఛాన్స్ దక్కిందని ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తరువాత రోజుల్లో సల్మాన్ ఖాన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని జాకీ ష్రాఫ్ అన్నారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్న సంగతి తెలిసిందే.