2006 లో టాలీవుడ్ లో ఒక బ్లాక్ బస్టర్ మూవీ రికార్డులను సృష్టించింది.ఆ మూవీ గురించి మీకు గుర్తుకు వచ్చే ఉంటుంది అదే మహేష్ బాబు,పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి.
ఈ చిత్రం తో మహేష్ లుక్స్ నే పూరి ఒక్కసారిగా మార్చేశాడు.అప్పటివరకు మిల్కి బాయ్ గా ఉన్న మహేష్ లో మాస్ లుక్ కూడా ఉంది అని నిరూపిస్తూ వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా మహేష్ కెరీర్ లో పోకిరి ముందు పోకిరి తరువాత అన్నట్లుగా మారిపోయింది.
అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది.
అయితే టాలీవుడ్ లో కాదులేండీ బాలీవుడ్ లో.ఈ చిత్రాన్ని 2009 లో బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే.అది కూడా బాలీవుడ్ లో బాగానే విజయాన్ని కూడా అందుకుంది.
అయితే ఇప్పుడు బాలీవుడ్ లో ఈ చిత్రానికి సీక్వెల్ ని రూపిందించాలని భావిస్తున్నారట.అయితే వాటెండ్ మూవీ కి దర్శకత్వం వహించిన ప్రభుదేవా నే ఈ సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం దబాంగ్ 3 షూటింగ్ లో బిజీ గా ఉన్న సల్లు భాయి సంజయ్ లీలా బన్సాలి చిత్రం అయినా ఇన్షా అల్లా చిత్రం లో కూడా నటిస్తున్నారు.అయితే దబాంగ్ 3 కి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తుండగా,వాటెండ్ సీక్వెల్ కు కూడా ప్రభుదేవా నే దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది.
అయితే తెలుగులో కూడా ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ అది మాత్రం పట్టాలెక్కలేదు.అయితే తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ చిత్రానికి సీక్వెల్ బాలీవుడ్ లో రాబోతుండడం విశేషం.మరి దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు,దీనికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.