కరోనా కారణంగా థియేటర్లు దాదాపుగా పది నెలల పాటు మూత పడే ఉన్నాయి.ఇంకా కూడా పూర్తి స్థాయిలో థియేటర్లు పునః ప్రారంభం అవ్వలేదు.
ఈ సమయంలో పదుల కొద్ది చిన్న సినిమాలు ఓటీటీ దారి పట్టాయి.కొన్ని బడా హీరోల సినిమాలు కూడా ఓటీటీ లో విడుదల అయ్యాయి.
థియేటర్లు పునః ప్రారంభం అయిన నేపథ్యంలో మళ్లీ ఓటీటీ లో స్టార్ హీరోల సినిమాలు ఉండక పోవచ్చు అంటూ అభిమానులు భావించారు.ఇలాంటి సమయంలో కొందరు స్టార్ హీరోలు ఇంకా ఓటీటీ వైపు చూస్తున్నారు.
డబ్బులకు ఆశ పడి థియేటర్ల కంటే ఓటీటీల ద్వారా ఎక్కువ వస్తుందనే ఉద్దేశ్యంతో ఓటీటీ రిలీజ్ కు సిద్దం అవుతున్నారు.ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ రాధే మూవీ ని కూడా ఓటీటీ లో విడుదల చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మీడియాలో వస్తున్న వార్తలతో సల్మాన్ ఖాన్ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.థియేటర్లు ఓపెన్ అయిన ఈసమయంలో మళ్లీ ఓటీటీ ఎందుకు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.ఒక అభిమాని ఏకంగా రాధే సినిమాను ఓటీటీలో విడుదల చేస్తే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాను అంటూ యూనిట్ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా సందేశం పంపించాడు.మరి కొందరు నిర్మాతలపై దాడులు చేస్తామని అంటున్నారు.
ఓటీటీలో విడుదల అయితే సినిమాను బహిష్కరిస్తామని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇలాంటి సమయంలో రాధే సినిమా విడుదల విషయంలో సల్మాన్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు అనేది అందరికి ఆసక్తికరంగా ఉంది.
ఈసినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించాడు.ఈద్ కు సినిమాను విడుదల చేస్తామని ఆమద్య సల్మాన్ స్వయంగా చెప్పాడు.
కాని పరిస్థితులు మారుతున్నట్లుగా యూనిట్ సభ్యుల ద్వా తెలుస్తోంది.