డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరు.బద్రి, ఇడియట్, పోకిరి, టెంపర్ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన దర్శకుడు పూరీ జగన్నాథ్.
మధ్యలో ప్లాపులు ఎదురయ్యి రేస్ లో వెనుక బడ్డాడు.అయితే రామ్ పోతినేని తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మరొక సారి తన సత్తా నిరూపించు కున్నాడు.
ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పూరీ జగన్నాథ్ మళ్ళీ రేస్ లోకి అడుగు పెట్టాడు.ప్రెసెంట్ పూరీ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
అసలు రౌడీ స్టార్ ఇక పూరీ కూడా తోడవ్వడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా ప్రెసెంట్ షూటింగ్ జరుపు కుంటుంది.
ఇక తాజాగా పూరీ జగన్నాథ్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.కొద్దీ రోజులుగా వీరిద్దరూ ఒక సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.వీరిద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.వీరి స్నేహం కారణంగా వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందని టాక్ వినిపిస్తుంది.అయితే తాజాగా ఈ ప్రచారం నిజం అని అనిపించేలా మరొక వార్త బయటకు వచ్చింది.
వీరిద్దరి కాంబోలో సినిమాను తెరకెక్కించ డానికి మైత్రి మూవీ మేకర్స్ సిద్ధంగా ఉందట.పూరీ స్క్రిప్ట్ రెడీ చేసుకుని సల్మాన్ ఖాన్ ను ఒప్పిస్తే చాలట.ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించడానికి మైత్రి మూవీ మేకర్స్ ముందుకొచ్చిందని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో పూరీ తన మార్క్ స్క్రిప్ట్ ను సల్మాన్ కోసం లాక్ చేసిన్నట్టు తెలుస్తుంది.మరి చూడాలి ఈ సినిమాపై అధికారిక ప్రకటన వస్తే కానీ ఏ విషయం తెలియదు.