భాగ్యశ్రీ అంటే వెంటనే ఎవరు గుర్తుపట్టలేకపోవచ్చు.అయితే ప్రేమపావురాలు హీరోయిన్ అంటే మాత్రం వెంటనే గుర్తు పడతారు.
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.హిందీలో తెరకెక్కి రిలీజ్ అయిన అన్ని భాషలలో ఈ సినిమాలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని అందులో హీరోయిన్ గా చేసిన భాగ్యశ్రీ పేరు కూడా ఒక్కసారిగా మారుమోగిపోయింది.
ఆ తరువాత తెలుగు కూడా రెండు, మూడు సినిమాలు ఈ భామ చేసింది.ఏవీ అనుకున్న స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు.
అయితే బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వస్తున్న సమయంలో ఊహించని విధంగా ప్రేమించి పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైంది.
తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త, నటుడు అయిన హిమాలయా దస్సానీని ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్న భాగ్యశ్రీ తరువాత పూర్తిగా సినిమాలకి దూరమైంది.
అయితే మరల గత కొంత కాలంగా సినిమాలలో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది.దీనికి కారణం ఆమె భర్తతో విడిపోవడమే అని తెలుస్తుంది.తాను భర్తతో దూరంగా ఉంటున్న విషయాన్ని ఆమె అఫీషియల్ లో ప్రకటించింది.నాకు తొలిసారిగా ప్రేమ చిగురించింది హిమాలయా పైనే.
ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడాను కూడా.కానీ ఒకానొక సందర్భంలో మేం విడిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
అప్పుడు నా మనస్సు కుంగిపోయింది.ఇప్పటికి మేం విడిపోయి ఏడాదిన్నర కాలం గడిచిపోయింది అని ఆమె చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈమె ప్రభాస్ కొత్త సినిమాలో హీరోకి తల్లిగా నటిస్తుంది.