యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ప్రభాస్ మాస్ లుక్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.దీంతో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
కాగా గతకొద్ది రోజులుగా హైదరాబాద్లో వేసిన ఓ భారీ సెట్లో సలార్ షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ యాక్షన్ సీక్వెన్స్కు బదులుగా ఓ రొమాంటిక్ సాంగ్ను షూట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఈ క్రమంలోనే హైదరాబాద్లోనే ఈ పాట షూటింగ్ను నిర్వహంచాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.దీని కోసం అవసరమైన అన్ని ఏర్పా్ట్లు కూడా చిత్ర యూనిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ డ్యుయెల్ రోల్లో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి.కాగా ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తుండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది.
మొత్తానికి యాక్షన్ మూడ్ నుండి ‘సలార్’ను రొమాంటిక్ మూడ్లోకి తీసుకురావాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ అనుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాను కేజీఎఫ్ లాంటి బ్లాక్బస్టర్ మూవీని ప్రొడ్యూస్ చేసిన హొంబాలే ఫిలింస్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా నిర్మాణ విలువలు ఏ స్థాయిలో ఉంటాయో మనం ఊహించుకోవచ్చు.
ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై మాత్రం ఇంకా చిత్ర యూనిట్ నుండి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.