కన్నడలో కేజీఎఫ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్, ఆ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపును తెచ్చుకున్నాడు.కేజీఎఫ్ తెలుగు, హిందీ భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ను అందుకోవడంతో ఆ సినిమా సీక్వెల్ ‘కేజీఎఫ్ – చాప్టర్ 2’ కోసం వారు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రశాంత్ నీల్ తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో తెరకెక్కించబోతున్నట్లు అనౌన్స్ చేశాడు.
సలార్ అనే టైటిల్తో తెరకెక్కబోయే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
భారీ వ్యయంతో తెరకెక్కనున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రశాంత్ నీల్ తనదైన స్టయిల్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా షూటింగ్ను అతిత్వరలో ప్రారంభించేందుకు వారు ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ను ఎక్కడి నుండి ప్రారంభిస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమా కథ బొగ్గు గనుల నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈ సినిమా షూటింగ్ను తెలంగాణలోని గోదావరిఖనిలో మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ జరగబోయే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్లో ప్రభాస్ పాల్గొనబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఏదేమైనా ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా మూవీలతో అదరగొడుతుండటంతో ఆయన ఫ్యాన్స్ ఆయన సినిమాల కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ శృతి హాసన్ను చిత్ర యూనిట్ ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే.
మరి సలార్ చిత్రంతో ప్రభాస్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి.ఈ సినిమాను కేజీఎఫ్ నిర్మాతలు అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
మరి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.